భోజనశాల నిర్మాణం
2015 సంవత్సరం వర్షాకాలం వచ్చేసరికి, అప్పటిదాకా అన్నదానానికి వాడుతున్న పాక శిధిలావస్తకు వచ్చేసింది. దానిని అక్కడ తీసేసి ఇప్పుడు ఉన్న చోట కొత్తగా నిర్మించాలని నిర్ణయించాము. ఆ చోటు కూడా ఎప్పటిలాగా పల్లంగా ఉన్నదే. అందులో ఒక పెద్ద వేపచెట్టు, ఒక మారేడు చెట్టు ఉన్నాయి. వాటిని తీసేసి, తుప్పలు బాగు చేసి పూజారిగారి ఇంటి లైనుకు, కోనేరు compound లైనుకు కలిసేలాగ pillers పోసి, lock beams పోసి, బయటకు వెళ్ళే గేటు మట్టానికి పునాది తయారు చేశాము. దాని మట్టానికి మట్టి పోసి లెవలు చేశాము. తరువాత రేకులు slope ఎలా ఉండాలని, ఎత్తు ఎంత అయితే బాగుంటుందో అనేక అంచనాలు వేసి ఇప్పుడు ఉన్న విధంగా తయారు చేశాము.
అప్పటికి ముందే కట్టి ఉన్న గుడి దక్షిణం compound wall పిల్లర్ల మీద లైట్లు పెట్టడానికని 2″ ప్లాస్టిక్ పైపులను ఉంచి పిల్లర్లు పోయటం జరిగింది. ఆ పైపులలోనే 2″ ఇనప పైపులను Double slot చేసి OIL రాసి దిగగొట్టేశాము. అలాగే కొత్త పిల్లర్లలో కూడా 2″ ఇనప పైపులను ముందు design ప్రకారంగా slope వచ్చేలాగ అమర్చి పలక పైపులతో ఫ్రేము వెల్డింగు చేయించాము. దానిమీద ఒక్క జాయింటు మాత్రమే వచ్చేలాగ 16 అడుగులు 12 అడుగులు పొడవుగల రేకులు వాడి Roof తయారు చేశాము. ఒకేసారి 60 మంది భోజనం చేసేలాగ రెండు వైపుల అనుకూలంగా sitting and dining టేబుళ్ళను పాలిష్ రాళ్ళతో నిర్మించాము. క్రింద మొత్తం కాంక్రీటు ఫ్లోరింగు చేశాము.
ఈ పనంతా రెండు నెలల వ్యవధిలో పూర్తయ్యింది. 2015 దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి నాడు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి, వారితో గృహప్రవేశం లాంటి ప్రారంభోత్సవం చేసి, వారిని ఉత్తరం చివర ఉంచి, అన్నదానంతో ప్రారంభించాము.
కొద్దిరోజుల తరువాత రాజమండ్రి నుండి వచ్చి ఈ ఊరిలో రెండెకరాల పొలం కొన్న రెడ్డిగారు దానికి Tiles వేయించడానికి ముందుకు వచ్చారు. వారి సహకారంతో Flooring అంతా Tile Work చేయించాము. ఆ వెంటనే కార్తీక మాసంలో వచ్చిన సోమవారాలలో ఎప్పటి కంటే ఎక్కువగా అన్నదానం జరిగింది. కనక దుర్గ అమ్మవారి Flexie వేయించి ఉత్తరం చివర అమర్చాము. తప్పని పరిస్థితులలో తెగించి మొదలు పెట్టిన నిర్మాణము ఆ పరమాత్మ దయవల్ల పూర్తి అయ్యింది. ఇది ఎవరి అంచనాలకు అందలేదు. పూజారిగారి ఇంటికి కూడా ముందు భాగంలో రేకులతో ఇంపుగా ఒక Portico లాగ పూర్తి చేయగలిగాము. అందువలన నీడతోపాటు వర్షపు జల్లులు అరుగుల మీద, ఇంటిలోను పడకుండా రక్షణ ఏర్పడింది.

గుడి కాంపౌండు లోపల, కోనేరు మెట్లకు టైలు పని
రాజమండ్రిలో బంగారం వర్తకులు శ్రీ కాళేపల్లి తారకేశ్వరరావు, వారి కుమారుడు ప్రసాద్ గార్లకు ఈ ఊరిలో కొంత భూమి ఉంది. గుడి నిర్మాణం ప్రారంభించినప్పుడు ఊరిలో భూములు ఉన్న రైతులందరి దగ్గర విరాళాలు సేకరించే ప్రయత్నంలో వారి దగ్గరకు కూడా వెళ్ళాం. అప్పట్లో వారు రూ 10,000 తమ వంతు విరాళంగా ఇచ్చారు.
నిర్మాణం పూర్తి అయిన తరువాత అప్పుడప్పుడు వచ్చి స్వామివారిని దర్శించుకునే వారు. ప్రతి శివరాత్రికి రూ 2,000 విరాళంగా అన్నదానానికి ఇచ్చేవారు. 2015 వ సంవత్సరంలో దసరాలకు ముందు ఒకసారి గుడికి వచ్చినప్పుడు ఈ ప్రాంగణమంతా Tile Work చేయించడానికి అంగీకరించారు. అంతకు ముందు ఒక సంవత్సరం నుండి అంటున్నారు. మేము మొత్తం కొలతలు తీసి సుమారు ఆరువేల అడుగులు వస్తుందని నివేదిక ఇచ్చాము. కొంతమంది Phone చెయ్యమని అన్నారు కాని నేను చెయ్యలేదు. నేను చెప్తే అయ్యేది కాదు. స్వామి ఎప్పుడు ప్రేరణ కలిగిస్తే అప్పుడే అవుతుంది. 2015 డిశెంబరు నెలలో Tiles ని, మేస్త్రీలని పంపించారు. ఇసుక దొరకటం చాలా ఇబ్బందిగా ఉన్న రోజులు అవి. ఒక ట్రక్కు ఖరీదు నాలుగు వేలు అవుతోంది. మొత్తం ఖర్చు మూడు లక్షల రూపాయలు దాటింది. పనంతా పూర్తయిన తరువాత ఊరంతా అన్నదానం చేశారు. వారి కుటుంబాలను వస్త్రాలు పెట్టి సత్కరించి పంపించాము. ఒక్కొక్కరికి నాలుగు పుస్తకాల Set బహుమతిగా ఇచ్చాము. అవి
- ఒక యోగి ఆత్మ కథ
- నాహం కర్తా హరిః కర్తా
- నడిచే దేముడు
- శివుడే దేవాది దేవుడు
ఈ పుస్తకాలను శ్రద్ధగా చదివితే ఎంతో జ్ఞానం వస్తుంది. మన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ఎన్నో దివ్యమయిన విషయానుభూతులు కలుగుతాయి. ఆ ఫ్లోరింగు పని పూర్తయ్యేటప్పటికి దేవాలయం రూపురేఖలు ఎంతో మారిపోయాయి. ఈ పనులు 2016 జనవరి నెలలో పండగ ముందు పూర్తి అయ్యాయి.


